నిజంనిప్పులాంటిది

Jan 24 2024, 18:21

తహసిల్దార్ యోగేశ్వరి దేవి సస్పెండ్

శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం ఇంచార్జి, బత్తలపల్లి తహసీల్దార్ యోగేశ్వరి దేవిని సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు బుధవారం ఉత్తర్వులు జారీచేశారు.

ఎస్సీ, ఎస్టీలకు చెందిన కోట్ల రూపాయల విలువైన భూములను అధికార పార్టీ నేతలకు ఇష్టారాజ్యంగా కట్టబెట్టిందని తహశీల్దార్ పై వచ్చిన అవినీతి, అరోపణలపై జరిగిన సమగ్ర విచారణ అనంతరం తహశీల్దార్ యోగేశ్వరి దేవిని సస్పెండ్ చేస్తున్న‌ట్లు కలెక్టర్ పేర్కొన్నారు.

నిజంనిప్పులాంటిది

Jan 24 2024, 17:00

బీసీ ల చలో ఢిల్లీ : ఫిబ్రవరి 5 ,6 న

•బీసీ యువజన సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ తిరుమలగిరి అశోక్

ఫిబ్రవరి 5,6 తేదీలలో ఢిల్లీ లో జరిగే పార్లమెంటు ముట్టడికి బీసీ లందరూ పెద్ద ఎత్తున తరలిరావాలని మిర్యాలగూడలో బీసీ యువజన సంఘం సమావేశంలో బీసీ యువజన సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ తిరుమలగిరి అశోక్ మాట్లాడుతూ భారతదేశ జనాభాలో అత్యధికంగా ఉన్న బీసీలకు జనాభా కి దగ్గట్లుగా రిజర్వేషన్ లేకపోవడం వలన బీసీలకు తీవ్ర అన్యాయం జరుగుతుంది.

స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాల గడిచినప్పటికీ కూడా బీసీల బ్రతుకులు ఏమాత్రం మారలేదు బీసీ కుల గణన చేయాలి అని చెప్పేసి గత ఎంతో కాలంగా ఉద్యమం చేస్తున్నప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడం బాధాకరం కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంతృత్వ శాఖను ఏర్పాటు చెయ్యాలని పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం నిమ్మకు నీరు కట్టినట్టుగా వ్యవహరిస్తుంది.

కేంద్ర ప్రభుత్వం ఇకనైనా స్పందించి బీసీల డిమాండ్లు సానుకూలంగా స్పందించకపోతే పెద్ద ఎత్తున ఉద్యమానికి బీసీ లందరూ సిద్ధంగా ఉన్నారని ఆయన అన్నారు కార్యక్రమంలో ... ఆర్లపూడి శ్రీను, చిలకల మురళి యాదవ్, రాయించు నరసింహ, పగిళ్ల అనిల్, నరేష్, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.

నిజంనిప్పులాంటిది

Jan 24 2024, 16:45

సీఎం మమతాబెనర్జీకి స్వల్పగాయం

పశ్చిమబెంగాల్ సీఎం మమతాబెనర్జీ బుధవారం గాయపడ్డారు. ఆమె బుర్ద్వాన్‌లో సమావేశం ముగించుకుని కోల్‌కతాకు తిరిగి వస్తుండగా మమతా బెనర్జీ స్వల్పంగా గాయపడ్డారు.

సభాస్థలి నుంచి ప్రధాన రహదారిపైకి వస్తుండగా మమత కారు డ్రైవర్ ఒక్కసారిగా బ్రేకులు వేసినట్లు సమాచారం. ఈ కుదుపు వల్ల కారులో ఉన్న సీఎం మమత నుదిటిపై స్వల్ప గాయమైంది.

కాసేపటికి కోలుకున్న ఆమె అదే కారులో కోల్‌కతాకు బయలుదేరారు...

నిజంనిప్పులాంటిది

Jan 24 2024, 16:08

అయోధ్య రాముడిని దర్శించుకున్న హనుమంతుడు

అయోధ్య రాముడిని చూసేందుకు హనుమంతుడే అయోధ్యకు వచ్చాడంటూ ఆలయ ట్రస్ట్‌ శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర సోషల్‌ మీడియా ద్వారా తెలిపింది.

ఆయోధ్యలో నిర్మించిన రామ మందిరంలో బాలరాముడు కొలువుదీరిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మంగళవారం సాయంత్రం రామ్‌ లల్లా దర్శనానికి వానరం దక్షిణ ద్వారం గుండా గర్భగుడి లోకి ప్రవేశించింది.

విగ్రహం వరకు వెళ్లడంతో సిబ్బంది పట్టకునేందుకు చూడగా ఉత్తర ద్వారం వైపు వెళ్లిపోయినట్లు ఆలయ అధికారులు తెలిపారు..

నిజంనిప్పులాంటిది

Jan 24 2024, 16:07

YS Sharmila: భాజపాతో వైకాపాది కంటికి కనిపించని పొత్తు: వైఎస్‌ షర్మిల

విశాఖ: రాష్ట్రంలో కుమ్మక్కు రాజకీయాలు నడుస్తున్నాయని ఏపీ కాంగ్రెస్‌ చీఫ్‌ వైఎస్‌ షర్మిల అన్నారు. పాలకపక్షం, ప్రతిపక్షం భాజపాతో ములాఖత్‌ అయ్యాయని ఆరోపించారు..

విశాఖలో పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆమె మాట్లాడారు. ''భాజపాతో వైకాపా కంటికి కనిపించని పొత్తు పెట్టుకుంది. రాష్ట్రానికి ప్రత్యేక హోదాపై ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు జగన్‌ మాట్లాడారు. అధికారంలోకి వచ్చాక దానిపై పోరాటమే లేదు..

విశాఖకు ఏం చేశారు? రైల్వే జోన్‌ కూడా ఇవ్వలేదు. గంగవరం పోర్టులో రాష్ట్ర వాటాను అప్పనంగా ఇచ్చేశారు. విశాఖ ఉక్కు కార్మాగారానికి తూట్లు పొడుస్తున్నారు..

స్టీల్‌ప్లాంట్‌ను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి నిర్వీర్యం చేశాయి. ఇప్పుడున్న ప్రభుత్వం పోవాలి.. కాంగ్రెస్‌ రావాలి'' అని పిలుపునిచ్చారు..

నిజంనిప్పులాంటిది

Jan 24 2024, 16:06

హైదరాబాద్ మింట్ కాంపౌండ్ లో భారీ అగ్ని ప్రమాదం

హైదరాబాద్‌లో మరో అగ్ని ప్రమాదం సంభవించింది. మొన్ననే మాదాపూర్ పోలీస్ స్టేషన్‌లో అగ్నిప్రమాదం జరగ్గా.. మళ్ళీ ఈరోజుఉదయం మింట్ కాంపౌండ్‌ ప్రభుత్వ పుస్తక ముద్రణా కార్యాల యంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది.

ఈరోజు తెల్లవారుజామున జరిగిన ఈ ప్రమాదంలో ముద్రణా యంత్రాలు, పలు పుస్తకాలు మంటల్లో కాలి బూడిదైపోయాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వెంటనే సహాయక చర్యలు చేపట్టారు.

వెంటనే మంటలు ఆర్పడంతో పెను ప్రమాదం తప్పింది. షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగినట్లు అగ్నిమాపక సిబ్బంది వెల్లడించారు.

ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో ఉద్యోగులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఈ అగ్ని ప్రమాదానికి సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది..

నిజంనిప్పులాంటిది

Jan 24 2024, 16:05

సీఎం రేవంత్ రెడ్డి భ‌ద్ర‌త‌ లో మార్పు

సీఎం రేవంత్ రెడ్డి భ‌ద్ర‌త విష‌యంలో ఇంటెలిజెన్స్ బ్యూరో(ఐబీ) కీల‌క నిర్ణ‌యం తీసుకుంది.

ఆయన దగ్గరి భద్రతా సిబ్బంది మొత్తాన్ని మార్చేయాలని నిర్ణయిం చుకుంది. ముందుగా పోలీస్‌ సెక్యూరిటీని మార్చేసింది.

మాజీ సీఎం కేసీఆర్‌ దగ్గర పని చేసిన ఏ ఒక్క అధికారి గాని, సిబ్బంది గాని రేవంత్‌ రెడ్డి,వద్ద పెట్టొద్దని సీఎం వోను ఐబీ ఆదేశించింది.

రేవంత్‌కి సంబంధించిన ప్రతీ సమాచారం లీక్‌ అవుతోందనే నేపథ్యంలోనే ఐబీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.....

నిజంనిప్పులాంటిది

Jan 24 2024, 16:03

Purandeswari: జగన్‌ 'వైనాట్‌ 175' వెనుక దొంగ ఓట్ల కుట్ర: పురందేశ్వరి..

విజయవాడ: సీఎం జగన్‌ 'వైనాట్‌ 175' వెనుక దొంగ ఓట్ల ద్వారా లబ్ధి పొందాలనే కుట్ర దాగి ఉందని భాజపా (BJP) రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి (Daggubati Purandeswari) ఆరోపించారు..

విజయవాడలో 'గావ్‌ చలో అభియాన్‌'ను ఆమె ప్రారంభించారు. ఓటర్ల జాబితాలో వైకాపా ఎన్నో అక్రమాలకు పాల్పడుతోందన్నారు. ఒక్క తిరుపతి ఉప ఎన్నికలోనే 35 వేల దొంగ ఓట్లు వేయించారని మండిపడ్డారు. ప్రజలను భయభ్రాంతులకు గురిచేసి ఎన్నికల్లో గెలవాలని చూస్తున్నారని ఆ్రగహం వ్యక్తం చేశారు..

వీటిన్నింటినీ ప్రజలకు వివరించి జగన్‌ కుట్రలను అడ్డుకుంటామని చెప్పారు. జిల్లాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం రూ.కోట్లు మంజూరు చేసిందన్నారు. కేంద్రం సహకారం లేకుండా రాష్ట్రం చేసిందొక్కటీ లేదని విమర్శించారు. ఎన్నికల్లో పొత్తుల విషయం తమ అగ్రనాయకత్వం ఆలోచిస్తోందని పురందేశ్వరి తెలిపారు..

నిజంనిప్పులాంటిది

Jan 24 2024, 16:03

ఐఆర్ఆర్ కేసులో చంద్రబాబు బెయిల్‌ను సుప్రీంలో సవాలు చేసిన ఏపీ ప్రభుత్వం..

ఐఆర్ఆర్ కేసులో జనవరి 10న చంద్రబాబుకు బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు..

హైకోర్టు తీర్పును సుప్రీంలో సవాలు చేసిన ఏపీ ప్రభుత్వం..

చంద్రబాబు బయట ఉంటే సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉందన్న ఏపీ ప్రభుత్వం..

ఈ నెల 29న విచారణకు వచ్చే అవకాశం.

నిజంనిప్పులాంటిది

Jan 24 2024, 16:02

ఇండియా కూటమిపై మమతా బెనర్జీ సంచలన ప్రకటన

కాంగ్రెస్ తో పొత్తు లేదని తేల్చి చెప్పిన దీదీ

లోక్ సభ ఎన్నికల్లో బెంగాల్ లోని 42 చోట్లా టీఎంసీ పోటీ చేస్తుందని వెల్లడి

ఎన్నికల ఫలితాల తర్వాతే పొత్తుల గురించి ఆలోచిస్తామన్న దీదీ

ఇండియా కూటమిలో ప్రధాన పార్టీలలో ఒకటిగా వ్యవహరించిన టీఎంసీ